ఢిల్లీ బయలుదేరిన పవన్ కల్యాణ్

  • పవన్‌ వెంట నాదెండ్ల మనోహర్ 
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన నేతలు
  • మూడు రాజధానులపై బీజేపీ నేతలతో చర్చించనున్న పవన్
రాజధానిని అమరావతి నుండి కదలనివ్వను అంటూ రైతులకు హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కాసేపట్లో ఢిల్లీ చేరుకుని బీజేపీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం వరకు వారు అక్కడే ఉంటారు.

ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నేతలతో చర్చించేందుకు పవన్ వెళ్లారు. రాజధాని అంశంపై బీజేపీతో కలిసి పోరాడడానికి జనసేన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Telugudesam

More Telugu News