తిరుమల వెంకన్న ఆలయంలో నగల మాయం నిజమే... నిజాన్ని తేల్చిన విచారణ కమిటీ!

  • రెండేళ్ల క్రితమే ఫిర్యాదు
  • విచారించి తేల్చిన కమిటీ
  • నాటి ఏఈఓ శ్రీనివాసులుపై ఆరోపణలు
తిరుమల శ్రీవారి ఆలయంలో లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు మాయమైన మాట వాస్తవమేనని అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించి ఆరు నెలలు కాగా, ఇప్పుడు బయటకు వచ్చింది. టీటీడీ ఏఈఓగా శ్రీనివాసులు ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై బోర్డు ఓ విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఎంక్వయిరీ చేసి, నగల మాయం నిజమేనని తేల్చింది.

శ్రీనివాసులు ట్రెజరీ ఏఈఓగా ఉన్న సమయంలో నగలు మాయం అయ్యాయని విచారణ కమిటీ పేర్కొంది. 5 కిలోల బరువున్న వెండి కిరీటం, బంగారు నాణాలు, 2 ఉంగరాలు, ఓ నక్లెస్ కనిపించకుండా పోయాయని, వీటి విలువ దాదాపు రూ. 7.36 లక్షలని అధికారులు తేల్చారు. అయితే, ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపితమైన తరువాత 2018 నుంచే ఆయన వేతనం నుంచి నెలకు రూ. 25 వేల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించడం గమనార్హం.
Go Back to Shorts
Tirumala
Tirupati
AEO
Srinivasulu
Ornaments

More Telugu News