ఆర్‌బీఐ నుంచి మరో శుభవార్త.. నెఫ్ట్ చార్జీల ఎత్తివేత!

  • నెఫ్ట్ సేవలు 24 గంటలూ అందుబాటులోకి
  • జనవరి 1 నుంచి ఉచితంగా నెఫ్ట్ సేవలు
  • ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ
బ్యాంకు ఖాతాదారులకు భారతీయ రిజర్వు బ్యాంకు మరో శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవలను 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్‌బీఐ తాజాగా నెఫ్ట్ చార్జీలను ఎత్తివేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై నెఫ్ట్ లావాదేవీలకు ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు వివరించింది. కాగా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకులు గత కొంతకాలంగా నెఫ్ట్ చార్జీలను వసూలు చేయడం లేదు. ఆర్బీఐ తాజా ఆదేశాలతో ఈ సేవలను అన్ని బ్యాంకులు ఇకపై ఉచితంగా అందించనున్నాయి.
Go Back to Shorts
NEFT
RBI
Banks
Charges

More Telugu News