వెంగల శివ కుటుంబానికి నారా లోకేశ్ రూ.50 వేల ఆర్థిక సాయం

  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన 
  • ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులతో శివ ఆత్మహత్య 
  • శివ కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేశ్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటించారు. ఆత్మహత్యకి పాల్పడిన స్వర్ణకారుడు వెంగల శివ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం చేశారు.

ఈ విషయాన్ని నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపి, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. 'మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించాను. ఆత్మకూరు గ్రామంలో గత మూడు నెలలుగా ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకి పాల్పడిన స్వర్ణకారుడు వెంగల శివ కుటుంబసభ్యులను పరామర్శించి, రూ.50వేల ఆర్థిక సహాయం అందించాను. కుటుంబానికి అండగా ఉంటానని, శివ పిల్లల చదువుకి సహాయం అందిస్తానని భరోసా ఇచ్చాను' అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Guntur District

More Telugu News