'పెళ్లి చూపులు' హీరోయిన్ కి మరో ఛాన్స్ తగిలింది

  • 'పెళ్లి చూపులు'తో రీతూ వర్మకి మంచి పేరు 
  • ఆశించిన స్థాయిలో లేని అవకాశాలు 
  • త్వరలో నాగశౌర్య జోడీగా సెట్స్ పైకి
'పెళ్లి చూపులు' సినిమాతో తెలుగు తెరకి రీతూవర్మ పరిచయమైంది. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్నా, రీతూ వర్మకి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ జోడీగా ఒక సినిమా చేస్తోంది కూడా.

తాజాగా తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా సమాచారం. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. నాగశౌర్య కథానాయకుడిగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా రీతూవర్మను ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
Nagashourya
Ritu Varma

More Telugu News