బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్

  • డిసెంబర్ 20న రానున్న 'రూలర్'
  • త్వరలో బోయపాటితో సెట్స్ పైకి 
  • యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా సాగే కథ 
ప్రస్తుతం బాలకృష్ణ .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను అనుకుంటున్నారట. ఇప్పటికే 'జెర్సీ'.. 'జోడీ' సినిమాల ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
Go Back to Shorts
Balakrishna
Shraddha Srinadh

More Telugu News