స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వండి... టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డికి నోటీసులు జారీచేసిన పోలీసులు

  • సోమిరెడ్డిపై భూవివాదం
  • ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ ఆరోపణలు
  • వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
భూవివాదం కేసులో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీచేశారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి భూవివాదంలో సోమిరెడ్డిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోలీసులు సోమిరెడ్డిని కోరారు. సోమిరెడ్డి తనకు చెందిన 2.8 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారంటూ వేలూరు రంగారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Telugudesam
Somireddy
Police

More Telugu News