గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు.. పంచాయతీ భవనాలు కూడా!

  • తమదైన ముద్రకోసం అధికార పార్టీ ఆరాటం
  • అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభంకానున్న నూతన వ్యవస్థ
  • ఈ రూపులోకే మారనున్న పంచాయతీ భవనాలు
స్థానిక పాలనను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చేందుకు గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో తమదైన ముద్రకోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయ భవనాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులైన గ్రీన్‌, సియాన్‌, తెలుపు హంగులతో తీర్చిదిద్దుతున్నారు.

అలాగే, పంచాయతీ భవనాలకు కూడా ఇదే విధమైన రంగులతో హంగులు అద్దాలని ఆదేశించారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అవసరమైన ఆదేశాలను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కలెక్టర్‌లకు ఇచ్చారు.
Go Back to Shorts
gram sachivalayam
YSRCP
building colours

More Telugu News