ఇలాంటి అసమర్థులు ‘ఒక్క ఛాన్స్’ అని ప్రజలను ఎందుకు అడిగారు?: వైసీపీపై నారా లోకేశ్ ఆగ్రహం

  • బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తున్నారు
  • రేపు రాష్ట్రాన్నీ కేసీఆర్ కు ఇచ్చేస్తారేమో?
  • ట్విట్టర్ లో నారా లోకేశ్ ఘాటు విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు తమ చేతకానితనంతో ఏపీ ప్రభుత్వం బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తోందని లోకేశ్ విమర్శించారు. రేపు పాలన చేతకావట్లేదని రాష్ట్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లో పెడతారా? అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఇలాంటి అసమర్థులు ప్రజలను ఎందుకు అడిగారు? అని లోకేశ్ నిలదీశారు.

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా?’ అని ఘాటుగా విమర్శించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan
Twitter

More Telugu News