మహారాష్ట్రలో పన్నెండు నిమిషాల వ్యవధిలో నాలుగుసార్లు భూప్రకంపనలు!

  • అర్ధరాత్రి 1.03 నిమిషాలకు తొలిసారి ప్రకంపనలు
  • ఆ తర్వాత వరుసగా మరో మూడుసార్లు
  • మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఘటన
అర్ధరాత్రి దాటాక భూమి పన్నెండు నిమిషాల వ్యవధిలో నాలుగుసార్లు కంపించడంతో స్థానిక జనం హడలిపోయారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా దహను కేంద్రంగా ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే...నిన్న అర్ధరాత్రి దాటాక ఒంటి గంటా మూడు నిమిషాలకు తొలిసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదయింది. ఆ తర్వాత 1.15 గంటల మధ్య మరో మూడుసార్లు భూ ప్రకంపనలతో ఆ ప్రాంతం వణికింది. తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై వరుసగా 3.6, 2.9, 2.8గా నమోదయింది.

భూకంపం తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలిపోవడంతో దాని కింద చిక్కుకుని 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ వైపు భూ ప్రకంపనలు వణికిస్తున్నా, నిన్న రాత్రి నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం బయటకు రాలేకపోయారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడిపారు.
Go Back to Shorts
Maharashtra
palghar district
dahan area
earthquake

More Telugu News