వరల్డ్ కప్ ఫైనల్: పరుగుల వేటలో తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

  • ఇంగ్లాండ్ లక్ష్యం 242 రన్స్
  • 17 పరుగులు చేసి రాయ్ అవుట్
  • వికెట్ల బోణీ చేసిన మాట్ హెన్రీ
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు లక్ష్యఛేదన ఆరంభించింది. అయితే 28 పరుగుల స్కోరు వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ 17 పరుగులు చేసిన జాసన్ రాయ్ ని కివీస్ పేసర్ మాట్ హెన్రీ అవుట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (10), జో రూట్ (0) ఆడుతున్నారు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 పరుగులు చేసింది.
Go Back to Shorts
England
New Zealand
World Cup
Final
Lord's

More Telugu News