సీఎం కుమారస్వామి తక్షణమే రాజీనామా చేయాలి: బీజేపీ నేత యడ్యూరప్ప

  • కుమారస్వామికి మద్దతు లేదు
  • 15 మంది కాంగ్రెస్, జేడీఎస్, ఇద్దరు ఇండిపెండెంట్లు రాజీనామా చేశారు
  • రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకు సానుకూలం
కర్ణాటక సీఎం కుమారస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతల యడ్యూరప్ప డిమాండ్ చేశారు. మద్దతు లేని కారణంగా కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పదిహేను మంది కాంగ్రెస్, జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేశారని, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకు సానుకూలంగా ఉన్నారని అన్నారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని యడ్యూరప్ప నిన్న డిమాండ్ చేశారు. అవిశ్వాసతీర్మానం పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్పీకర్ వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని డిమాండ్ చేయడం విదితమే.
Go Back to Shorts
Karnataka
cm
kumaraswamy
bjp
yedurappa

More Telugu News