ప్రభుత్వ అధికారిపై బురద కుమ్మరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్!

  • ప్రభుత్వ ఇంజినీర్‌పై నితేశ్ రాణే దాడి
  • బకెట్లతో బురద కుమ్మరించిన అనుచరులు
  • మహారాష్ట్రలో ఘటన
ప్రభుత్వ ఇంజినీర్‌పై బకెట్‌లతో బురద కుమ్మరించిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే కుమారుడు నితేశ్ రాణే‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన అనుచరులు మరో 16 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ముంబై-గోవా జాతీయ రహదారిపై కంకావలి ప్రాంతంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన నితేశ్ రాణే పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు వేయకపోవడంపై అక్కడే ఉన్న ప్రభుత్వ ఇంజినీర్ ప్రకాశ్ షేడేకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద మార్గంలో ప్రజలు నడిచి ఎలా వెళ్తారని మండిపడ్డారు. అక్కడితో ఆగక ఆయనపై దాడిచేశారు.

ఎమ్మెల్యే అనుచరులు బకెట్లతో బురద తెచ్చి ఆయనపై కుమ్మరించారు. అనంతరం అతడిని ఆ బ్రిడ్జి రైలింగ్‌కు కట్టివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రభుత్వ అధికారిపై దాడికి సంబంధించి కంకావలి పోలీసులు పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే రాణే, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన జరగ్గా సాయంత్రం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 16 మందిని అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Maharashtra
Nitesh Rane
mud
engineer

More Telugu News