ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అప్పలనాయుడు

  • ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు
  • మంత్రులుగా ప్రమాణం చేయనున్న 25 మంది 
  • గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం
కాసేపట్లో ఏపీ మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడును ఎంపిక చేశారు. ఏపీ గవర్నర్ నరసింహన్ సమక్షంలో అప్పలనాయుడు ఇంతకు ముందే ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేశారు. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిపై రేపటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.
Go Back to Shorts
ap
protem speaker

More Telugu News