సమంత 'ఓ బేబీ' విడుదల తేదీ ఖరారు

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ'
  • కీలకమైన పాత్రలో లక్ష్మి 
  • టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్  
సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' రూపొందింది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి .. రాజేంద్ర ప్రసాద్ .. నాగశౌర్య ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 60 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతిని ఆవహించడం .. అందుకుగల కారణాలు .. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ సరదాగా సాగుతుందన్న మాట. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Go Back to Shorts
samanta
lakshmi
nagashourya

More Telugu News