ఢిల్లీలో కేజ్రీవాల్‌కు నిరాశ.. మొత్తం స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

  • కేజ్రీవాల్ ఇంటి వద్ద సైలెన్స్
  • ఏడుకు ఏడు స్థానాల్లోనూ బీజేపీ
  • కనిపించని కాంగ్రెస్ హవా
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ దేశ రాజధానిలో ఇక్కడ సర్వశక్తులు ఒడ్డింది. అందుకు తగిన ప్రతిఫలం కనిపిస్తున్నట్టే ఉంది. ఇక్కడ మొత్తం ఏడు స్థానాలు ఉండగా మొత్తం స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. కాంగ్రెస్‌-ఆప్‌లు చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నించి, ఆ తర్వాత విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్ అభ్యర్థులు మొత్తం వెనకంజలో ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ నివాసం బోసి పోయింది.
Go Back to Shorts
AAP
BJP
New Delhi
Congress

More Telugu News