మోదీపై 72 గంటలు కాదు.. 72 ఏళ్ల నిషేధం విధించాలి: అఖిలేశ్ యాదవ్

  • 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న మోదీ
  • విలువలు కోల్పోయి మాట్లాడుతున్నారంటూ అఖిలేశ్ మండిపాటు
  • మోదీ బ్లాక్ మనీ మెంటాలిటీకి ఇది నిదర్శనం అంటూ వ్యాఖ్య

ప్రధాని మోదీ తన బ్లాక్ మనీ మెంటాలిటీని బయటపెట్టుకున్నారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని అన్నారు. సిగ్గులేకుండా ఆయన మాట్లాడిన మాటలకు... ఆయనపై 72 గంటలు కాదు, 72 ఏళ్ల పాటు నిషేధం విధించాలని చెప్పారు.

'అభివృద్ధి కావాలని మనం అడుగుతుంటే... ప్రధానమంత్రి సిగ్గులేకుండా ఎలా మాట్లాడారో విన్నారా? 125 కోట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయిన మోదీ... విలువలు లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన బ్లాక్ మనీ మెంటాలిటీకి ఇది నిదర్శనం' అంటూ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
modi
akhilesh yadav
bjp
sp

More Telugu News