కర్ణాటకలో మరో ఐటీ దాడి.. దేవెగౌడ కుటుంబ ఆలయంపై దాడులు

  • దేవెగౌడ స్వగ్రామంలోని శివాలయంలో దాడులు
  • గర్భగుడిలోకి ప్రవేశించేందుకు యత్నించిన అధికారులు
  • అడ్డుకున్న ఆలయ సిబ్బంది
కర్ణాటకలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో ఐటీ దాడులు జరిగాయి. ఈ ఆలయం దేవెగౌడ స్వగ్రామమైన హరదనహళ్లిలో ఉంది. ఆ దాడులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ దాడులపై ఆలయ పూజారి భార్య మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు ఐటీ అధికారులు వచ్చి ఆలయం పక్కన ఉన్న తమ ఇంట్లో తనఖీలు నిర్వహించారని చెప్పారు. చివరకు అత్యంత పవిత్రమైన గర్భగుడిలోకి ప్రవేశించేందుకు కూడా యత్నించారని... దానిని తాము అడ్డుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఆలయంలో సోదాలు నిర్వహించి ఖాళీ చేతులతో వెనుదిరిగారని చెప్పారు. తనిఖీల సందర్భంగా దేవెగౌడ కుటుంబానికి చెందిన సొమ్మును ఇక్కడ ఉంచారా? అని అధికారులు తమను ప్రశ్నించారని ఆమె తెలిపారు.
Go Back to Shorts
devegowda
temple
it
raids

More Telugu News