జింద్ నియోజకవర్గ ఉపఎన్నికలో ముందంజలో బీజేపీ

  • సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో అనివార్యమైన ఉప ఎన్నిక
  • కాంగ్రెస్ నుంచి పోటీలో రణదీప్ సింగ్ సుర్జేవాలా
  • ఓట్ల లెక్కింపులో మూడో స్థానంలో కాంగ్రెస్
హరియాణాలోని జింద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరి చంద్ మిద్దా మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ నియోజకవర్గంలో ఈ నెల 27న ఉప ఎన్నిక జరిగింది. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా బీజేపీ అభ్యర్థి కృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి హరిచంద్ కుమారుడు కృష్ణ మిద్దా, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా, జననాయక్ జనతా పార్టీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీకి దిగారు. ఈ ఉప ఎన్నికలో ప్రస్తుతం బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. జననాయక్ జనతా పార్టీ రెండవ స్థానంలోనూ, కాంగ్రెస్ మూడవ స్థానంలోనూ కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Haryana
Jind
Hari chand Midda
Krishna Midda
Ranadeep Singh
Digvijay Chouthala

More Telugu News