'యాత్ర'లో ఎమ్మెల్యే గా కనిపించనున్న అనసూయ

  • మమ్ముట్టి ప్రధాన పాత్రలో 'యాత్ర'
  • రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు
  • ఫిబ్రవరి 8వ తేదీన విడుదల  
ఒక వైపున బుల్లితెరపై సందడి చేస్తూనే మరో వైపున వెండి తెరపై అల్లరి చేస్తూ అనసూయ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాంటి అనసూయ 'యాత్ర' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా రూపొందిన ఈ సినిమాలో అనసూయ ఎవరి పాత్రలో కనిపించనుందనే విషయంపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. ఈ సినిమాలో ఆమె ఎమ్మెల్యే గా కనిపించనుందనేది తాజా సమాచారం.

ఎమ్మెల్యే 'గౌరు చరితా రెడ్డి' పాత్రలో అనసూయ కనిపించనుందని అంటున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? .. అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషి .. మొదలైన విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారట. వైఎస్ పాత్రలో మమ్ముట్టి .. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
anasuya

More Telugu News