ఎన్టీఆర్ నివాళి కార్యక్రమానికి గైర్హాజరైన టీటీడీపీ ఎమ్మెల్యే

  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించిన టీడీపీ నేతలు
  • పంచాయతీ ఎన్నికల నామినేషన్లతో బిజీగా ఉన్నానన్న సండ్ర
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో టీటీడీపీ నేతలు నివాళి అర్పించారు. అయితే, ఈ కార్యక్రమానికి సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గైర్హాజరయ్యారు. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవగా... వారిలో ఒకరు కార్యక్రమానికి రాకపోవడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై సండ్ర స్పందిస్తూ, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వల్ల తాను హైదరాబాదుకు రాలేదని చెప్పారు. అంతకు మించి మరే ఉద్దేశం లేదని తెలిపారు. మరోవైపు, టీఆర్ఎస్ లోకి వెళ్లే యోచనలో సండ్ర ఉన్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
ntr
tTelugudesam
sandra

More Telugu News