ఆ 20 మంది నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకుంటాం: విశాల్

  • సినీ నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేసిన ఓ వర్గం
  • ఖండించిన నిర్మాతల మండలి
  • నోటీసులు జారీ చేయాలని నిర్ణయం
తమిళ సినీ నిర్మాతల మండలిలో వర్గ విభేదాలు కలకలం రేపుతున్నాయి. మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ కు వ్యతిరేకంగా మరోవర్గం... మండలి కార్యాలయానికి తాళం వేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో విశాల్ ను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో, కార్యాలయానికి తాళం వేసిన 20 మందికి పైగా నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాల్ స్పష్టం చేశాడు. చెన్నైలో నిర్మాతల మండలి కార్యాలయంలో విశాల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యవర్గసభ్యులంతా పాల్గొన్నారు. కార్యాలయానికి తాళం వేసిన ఘటనను అందరూ ఖండించారు. కార్యాలయానికి తాళం వేసిన నిర్మాతల జాబితా తయారు చేసి, వారందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. 
Go Back to Shorts
vishal
kollywood
producers counsil

More Telugu News