తీవ్ర పోటీ మధ్య.. 'మారి 2' విడుదలకి సిద్ధం!

  • సెన్సార్ పూర్తిచేసుకున్న 'మారి 2'
  • ధనుశ్ జోడీగా సాయిపల్లవి 
  • ఈ నెల 21వ తేదీన విడుదల       
ధనుశ్ కథానాయకుడిగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో 'మారి 2' నిర్మితమైంది. ధనుశ్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

 తమిళంలో మాస్ హీరోగా ధనుశ్ కి మంచి క్రేజ్ వుంది. 'మారి 2' కూడా మాస్ కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ధనుశ్ సినిమాల్లో 'రఘువరన్ బీటెక్' మాత్రమే తెలుగులో సక్సెస్ అయింది. ఆ తరువాత వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా 21వ తేదీన రావడానికే ఆయన సిద్ధమవుతున్నాడు. 'పడి పడి లేచే మనసు' .. 'అంతరిక్షం' .. 'కేజిఎఫ్' పోటీని తట్టుకుని 'మారి 2' నిలబడవలసి ఉంటుంది. 
Go Back to Shorts
dhanush
saipallavi

More Telugu News