సెక్రటేరియట్ లో దొరకడు.. ప్రగతి భవన్ లో చిక్కడు.. ఫాంహౌస్ లో దొరకడు: గద్దర్

  • కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలకాలి
  • యువకులు గ్రామాల్లో తిరిగి చైతన్యం తీసుకురావాలి
  • కేసీఆర్ కు ఓటుతో సమాధానం చెప్పాలి
ప్రజా కూటమికి ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని.. కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలకాలని గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ దొర ఎవరికీ దొరకడని ఎద్దేవా చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ, 'సెక్రటేరియట్ లో దొరకడు.. ప్రగతి భవన్ లో చిక్కడు.. ఫాంహౌస్ లో దొరకడు' అని విమర్శించారు.

లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని... కట్టాల్సిన ప్రాజెక్టులను కూడా కట్టలేదని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారని... ఏ ఒక్కరికీ ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టును కట్టాలని... కానీ, రీడిజైను చేసి పచ్చని పంట పొలాలను ఎడారిగా మార్చేశారని విమర్శించారు. యువకులు గ్రామాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని... ఓటుతో సమాధానం చెప్పి కేసీఆర్ ను గద్దె దించాలని కోరారు.
Go Back to Shorts
kcr
gaddar
TRS

More Telugu News