కాంగ్రెసోళ్లు దేశముదుర్లు! జాగ్రత్త!: మంత్రి కేటీఆర్

  • నాటి ప్రభుత్వాలు తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు
  • తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నాం
  • టీఆర్ఎస్ కే మళ్లీ పట్టం కట్టాలి
కాంగ్రెసోళ్లు దేశముదుర్లు అని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి ప్రభుత్వాలు తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.  ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని, తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న టీఆర్ఎస్ కే మళ్లీ పట్టం కట్టాలని కోరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామని, రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబీమా ద్వారా బాధిత రైతు కుటుంబాలను ఆదుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతులకు ఎంత సాయం చేసినా తక్కువేనని అన్నారు.
Go Back to Shorts
congress
TRS
KTR
siricilla

More Telugu News