చినజీయర్‌ స్వామి ఆశీర్వాదం పొందిన టీఆర్‌ఎస్‌ అధినేత

  • ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి శంషాబాద్‌ సమీపంలోని ఆశ్రమానికి రాక
  • హోమంలో పాల్గొన్న కేసీఆర్‌
  • ఎన్నికల ముందు స్వామి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి ఆశీస్సులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ఆశ్రమాన్ని ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. అక్కడ జరిగిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం చినజీయర్‌ స్వామి కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు. ఎన్నికల సమయంలో ఇలా చినజీయర్‌ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందడం టీఆర్‌ఎస్‌ అధినేతకు అలవాటు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొనాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Go Back to Shorts
KCR
Chinajeeyaru swamy
samshabad

More Telugu News