మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబుపై దాడి వివాదం.. దళిత సంఘాల నుంచి వ్యతిరేకత!

  • వినాయక విగ్రహం వద్ద రావెలపై దాడి
  • దళిత, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుపై దాడి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ముట్లూరులో వినాయక విగ్రహం వద్ద ఆయనపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి పాల్పడిన వారిని నేటికీ అరెస్ట్ చేయకపోవడం వివాదానికి దారి తీస్తోంది. ఈ విషయమై దళిత, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నెల 16న జాతీయ ఎస్సీ కమిషన్ ముట్లూరుకు రానుంది. ఈ నేపథ్యంలో దళిత, ప్రజా సంఘాల నేతలు 16న చలో ముట్లూరుకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ముట్లూరుకు తరలివచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికైనా రావెలపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Ravela Kishore Babu
Mutluru
Vinayaka statue
SC Commission

More Telugu News