అమిత్ షా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు.. తెలంగాణలో ఆరెస్సెస్ రాజ్యం నడవదు: అసదుద్దీన్ ఒవైసీ
- తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన పాలనే ఉంటుంది
- ఎంజే అక్బర్ ను ఎందుకు బర్తరఫ్ చేయలేదు?
- అమిత్ షా విమర్శలకు కౌంటర్ ఇచ్చిన ఒవైసీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ఆరెస్సెస్ రాజ్యం నడవదని... రాజ్యాంగబద్ధ పాలనే ఉంటుందని చెప్పారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ను ఇంకా ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు. కరీంనగర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలపై అమిత్ షా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఒవైసీ విమర్శలు గుప్పించారు.