ముగిసిన సర్వేశ్వరరావు, సోమ అంత్యక్రియలు

  • పాడేరులో కిడారికి, అరకులో సోమకు అంత్యక్రియలు
  • అంత్యక్రియల్లో పాల్గొన్న ఏపీ మంత్రులు 
  • అధికసంఖ్యలో హాజరైన గిరిజనులు, పార్టీ కార్యకర్తలు
మావోయిస్టులు కాల్చి చంపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భౌతికకాయాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పాడేరులో కిడారికి, అరకులో సోమకు అంత్యక్రియలు నిర్వహించారు. కిడారి చితికి ఆయన పెద్దకుమారుడు శ్రవణ్ నిప్పంటిచారు.

ఓపక్క వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కిడారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కిడారి అంత్యక్రియల్లో మంత్రులు ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో సోమ అంత్యక్రియలు

అరకులోని సోమ స్వస్థలం బట్టివలసలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో, క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో సోమ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Go Back to Shorts
araku
paderu

More Telugu News