కాంగ్రెస్ పార్టీలో కేఎస్ రత్నం చేరికకు ముహూర్తం ఖరారు!

  • ఇప్పటికే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నేత
  • ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
  • నేడు అనుచరులతో చేవెళ్లలో సమావేశం
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పార్టీ మారతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న భారీఎత్తున అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వెల్లడించాయి.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరితో కలిసి వెళ్లి రత్నం పార్టీలో చేరనున్నారని సమాచారం. ఇందుకోసం ఈ రోజు చేవెళ్లలో అనుచరులతో రత్నం సమావేశం నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Congress
ks ratnam
TRS
join

More Telugu News