హరికృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది: జీవీఎల్

  • హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి
  • నందమూరి కుటుంబసభ్యులకు సంతాపం చెబుతున్నా
  • ఇలాంటి ఘటన వారి కుటుంబంలో గతంలోనూ జరిగింది
టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతిపై రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. హరికృష్ణ గారి విషాదమరణ వార్త తనను, తమ పార్టీని దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని, నందమూరి కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఇలాంటి విషాద సంఘటన వారి కుటుంబంలో గతంలో కూడా జరిగిన విషయాన్ని జీవీఎల్ ప్రస్తావించారు. 
Go Back to Shorts
hari krishna
gvl

More Telugu News