అవును.. విద్యార్థులను పడుపు వృత్తిలోకి పంపేందుకు యత్నించా!: తమిళనాడు మహిళా ప్రొఫెసర్ అంగీకారం

  • యువతులకు ఉద్యోగాల ఆశ చూపిన నిర్మల
  • ఫోన్ సంభాషణలు వైరల్
  • కోర్టుకు వాంగ్మూలం సమర్పించిన అధికారులు
కాలేజీ యువతులను ఉన్నతాధికారులు, నేతలో గడపాలంటూ వారిని పడుపు వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించానని తమిళనాడులోని అరుప్పుకోట దేవాంకుర్ ప్రైవేటు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అంగీకరించింది. ఈ మేరకు ఆమె సీబీసీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. కొన్ని నెలల క్రితం కాలేజీ విద్యార్థినులకు ఫోన్ చేసిన నిర్మలాదేవి.. ‘గవర్నర్ తాత (తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్)తో గడిపితే మీకు మంచి మార్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. గవర్నర్ పురోహిత్ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తనకు నిర్మలాదేవితో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆమెతో పాటు మధురై కామరాజార్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, మాజీ పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో కేసును విచారించిన సీబీసీఐడీ.. పక్కాగా ఆధారాలను సేకరించింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో నలుగురు యువతులను పడుపు వృత్తిలోకి నెట్టేందుకు ప్రయత్నించానని పోలీసుల ముందు నిర్మల ఒప్పుకుంది. దీంతో ఆమె వాంగ్మూలాన్ని, నివేదికను పోలీసులు మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు.
Go Back to Shorts
Tamilnadu
governer
nirmala devi
prostitution
CBCID

More Telugu News