సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజశేఖర్ నాయికగా అంజలి 
  • రేపు రవితేజ ఫస్ట్ లుక్ విడుదల 
  • అగ్ర నిర్మాత చేతిలో 'పేపర్ బాయ్'
  • రోజుకి సునీల్ పారితోషికం ఎంతంటే..!  
*  ప్రముఖ నటి అంజలి డాక్టర్ రాజశేఖర్ సరసన నటించనుంది. 'గరుడవేగ' సినిమా తర్వాత రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన కథానాయికగా అంజలిని తీసుకున్నారు.
*  శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రేపు (సోమవారం) దర్శకుడు విడుదల చేయనున్నాడు.
*  దర్శకుడు సంపత్ నంది నిర్మించిన 'పేపర్ బాయ్' చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. చిత్రం పట్ల వున్న నమ్మకంతో ఆయన ఈ హక్కులను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
*  హాస్య నటుడు సునీల్ ప్రస్తుతం పలు సినిమాల్లో కామెడీ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయన భారీ స్థాయిలో రోజుకి మూడున్నర లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నాడట. 
Go Back to Shorts
Anjali
Raviteja
Sunil
Rajashekhar

More Telugu News