సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సుధీర్ బాబుతో జతకట్టనున్న మెహ్రీన్ 
  • ఏఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ 
  • మలయాళ చిత్రంలో 'గూఢచారి' నాయిక  
*  సుధీర్ బాబు సరసన మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు. ఈ చిత్రం షూటింగ్ రేపు ప్రారంభమవుతుంది. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.    
*  రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందుకు గాను ఆయనకు 4 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ నటుడుకి ఈ స్థాయిలో తెలుగు సినిమాకి పారితోషికం ఇవ్వడం విశేషమే!  
*  'గూఢచారి' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక శోభిత ధూళిపాళ మలయాళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. యంగ్ హీరో నివిన్ పౌలీ సరసన 'మూతోన్' అనే సినిమాలో శోభిత నటించనుంది. 
Go Back to Shorts
Mehrin
Sudhirbabu
Jayalalitha
Shobhita

More Telugu News