హైదరాబాద్ నుంచి చెన్నైకి రైలెక్కిన హీరోయిన్ మెహరీన్... ఆపై ఎదురైన భయానక అనుభవం!

  • విమానంలో టికెట్ దొరకక రైల్లో ప్రయాణం
  • అప్పటికే బెర్త్ ఆక్రమించేసిన మందుబాబు
  • చాలాసేపు నిలబడే మెహరీన్ ప్రయాణం
యువ హీరోలతో సినిమా చాన్స్ లను కొట్టేసి, దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్ కు రైల్లో ఓ భయానక అనుభవం ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం తమిళ చిత్రం 'నోటా'లో నటిస్తున్న ఆమె, సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె ప్రయాణం చేయాల్సి వుండగా, విమానంలో టికెట్ దొరకక పోవడంతో రైల్లో ప్రయాణించేందుకు అంగీకరించిందట.

సదరు నిర్మాత ఓ బెర్త్ బుక్ చేయించగా, తాను రైలు ఎక్కే సమయానికే పూటుగా తాగిన ఓ వ్యక్తి, తన బెర్త్ ను ఆక్రమించాడట. అతన్ని చూసి భయంతో వణికిపోయిన మెహరీన్, అతన్ని కదపడం ఇష్టంలేక చాలాసేపు రైల్లో నిలబడే ఉందట. చివరకు నిర్మాతకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఆయన స్పందించి, ఓ కారులో తన మనుషులను పంపారట. వారు మరో స్టేషన్లో మెహరీన్ ను రైలు నుంచి దించేసి, కారులో చెన్నైకి తీసుకెళ్లారట. ఈ విషయాన్ని వెల్లడించిన 'నోటా' బృందం, మెహరీన్ చాలా భయపడిపోయిందని, ఇటువంటి ఘటనలు పలువురికి ఎదురవుతున్నాయని తెలిపారు.
Go Back to Shorts
Mehareen
Hyderabad
Chennai
Train

More Telugu News