రాజమౌళి మల్టీస్టారర్ లో కీర్తి సురేశ్?

  • రాజమౌళి నుంచి భారీ మల్టీ స్టారర్ 
  • హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి
తెలుగులో ఇంతకు ముందే 'నేను శైలజ '.. నేను లోకల్' వంటి సక్సెస్ లను అందుకున్న కీర్తి సురేశ్, 'మహానటి'తో మరింత క్రేజ్ పెంచుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఆమె స్థాయిని అమాంతంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో రాజమౌళి మల్టీస్టారర్ మూవీలో కీర్తి సురేశ్ కి ఛాన్స్ లభించినట్టు చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా రాజమౌళి ఒక భారీ మల్టీ స్టారర్ మూవీని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి 'మహానటి' చూడటం జరిగింది. కీర్తి సురేశ్ అభినయం ఆయనకి బాగా నచ్చేసిందట. దాంతో తన సినిమాలో ఒక హీరోయిన్ గా ఆమెను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఆమె ఎన్టీఆర్ జోడీగా కనిపిస్తుందో .. చరణ్ సరసన అలరిస్తుందో చూడాలి.    
Go Back to Shorts
ntr
chara
keerti suresh

More Telugu News