నెక్స్ట్ మూవీ షూటింగులో బెల్లంకొండ శ్రీను .. ఆయన జోడీగా ఎమీ జాక్సన్

  • విడుదలకి సిద్ధమైన 'సాక్ష్యం'
  • సెట్స్ పైకి నెక్స్ట్ మూవీ 
  • కథానాయికలుగా కాజల్ .. ఎమీ జాక్సన్  
ఒక సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే మరొక సినిమాను ప్లాన్ చేసుకుంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ముందుకెళుతున్నాడు. త్వరలో 'సాక్ష్యం' సినిమాతో ఆడియన్స్ ను పలకరించనున్న ఆయన, శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. థ్రిల్లర్ నేపథ్యంలోని ఈ కాన్సెప్టు నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

నవీన్ శొంఠినేని నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా కాజల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా ఎమీ జాక్సన్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్ విలన్ గా నటిస్తుండగా, తమన్ స్వరాలను అందిస్తున్నాడు.   
Go Back to Shorts
bellamkonda
kajal
amy

More Telugu News