కర్ణాటకలో అప్పుడే ఓటర్లను ప్రలోభ పెడుతోన్న నేతలు.. దొరికిపోయిన మహిళా నేత

  • మే 12న అసెంబ్లీ ఎన్నికలు
  • పోటాపోటీగా ప్రచారం
  • ఓ ట్రక్కులో తనిఖీలు
  • ఫ్రెషర్‌ కుక్కర్‌లు స్వాధీనం
కర్ణాటకలో మే 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాగే, ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ కొందరు నేతలు అధికారులకు చిక్కుతున్నారు. ఈ రోజు ఆ రాష్ట్రంలోని బెళగవి నుంచి వెళుతోన్న ఓ ట్రక్కును అధికారులు తనిఖీ చేయగా, అందులో మహిళా కాంగ్రెస్‌ సెల్‌ అధ్యక్షురాలు లక్ష్మి హెబ్బాల్కర్‌ ఫొటోలతో ఉన్న ప్రెషర్‌ కుక్కర్‌ బాక్సులను గుర్తించారు.

వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌కి ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు.
Go Back to Shorts
Karnataka
Congress
BJP

More Telugu News