అందాల హీరోయిన్‌లను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. ఫొటోలు

  • ఏలూరుకి వచ్చిన రాశీఖన్నా, రీతూ వర్మ, మెహరీన్
  • ఘ‌న స్వాగ‌తం లభించిందన్న రాశీఖన్నా
  • అభిమానులకు హాయ్‌ చెప్పి అలరించిన అందాల భామలు
త‌మ‌కు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఘ‌న స్వాగ‌తం లభించిందని హీరోయిన్ రాశీఖన్నా తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. ఆ నగరంలోని ఆర్.ఆర్.పేటలో ఈ రోజు రాశీఖన్నాతో పాటు ఇతర హీరోయిన్లు రీతూ వర్మ, మెహరీన్ ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ముగ్గురు హీరోయిన్లు తమ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు భారీగా అక్కడికి తరలివచ్చారు.

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ కలియదిరుగుతూ, ఆ హీరోయిన్లు షాపులోని చీరలను పరిశీలించారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ అభిమానులకు హాయ్ చెప్పి వారిని అలరించారు. అనంతరం తమ ఫొటోలను సదరు హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.        
Go Back to Shorts
mehreen
rashi kanna
West Godavari District

More Telugu News