రాత్రి 8 గంటలకు ముంబై చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

  • దుబాయ్ లో శ్రీదేవి భౌతిక కాయానికి పోస్టు మార్టం
  • రాత్రి 8 గంటలకు ముంబై చేరుకోనున్న భౌతికకాయం
  • శ్రీదేవి నివాసానికి భారీగా చేరుకుంటున్న సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు
గుండెపోటుతో దుబాయిలో కన్నుమూసిన ప్రముఖ సినీ నటి శ్రీదేవి భౌతికకాయం ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో ముంబయి చేరుకోనుందని తెలుస్తోంది. మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం నిమిత్తం కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి గత రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని నిబంధనల ప్రకారం పోస్టు మార్టం నిమిత్తం దుబాయ్‌ లోని ఒక ఆసుపత్రికి తరలించారు.

కాగా, శ్రీదేవి మరణవార్త తెలుసుకున్న బాలీవుడ్‌, ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు అంథేరిలోని ఆమె నివాసానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భౌతికకాయం రాత్రి 8 గంటల సమయంలో రానుందని, ఆమె భౌతికకాయాన్ని తీసుకొచ్చేందుకు ముంబయి నుంచి ప్రత్యేక విమానం దుబాయికి వెళ్లిందని సమాచారం. 
Go Back to Shorts
Sridevi
film industry
mumbai
dubai

More Telugu News