రేపు ఏపీ మంత్రి మండలి కీలక సమావేశం

  • అమరావతి, సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో సమావేశం
  • ఉదయం 10.30 గంటల నుంచి సమావేశం ప్రారంభం 
  • వచ్చేనెల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయంపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో ఉదయం 10.30 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుందని చెప్పారు.

కాగా, వచ్చేనెల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో దానిపై చర్చించే అవకాశం ఉంది. పలు అంశాలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.  
Go Back to Shorts
Andhra Pradesh
budget
Chandrababu
Telugudesam

More Telugu News