ఇద్దరు హీరోలను ఎదిరించి నిలబడ్డాను .. క్షమాపణ పత్రం రాయనని చెప్పాను!: జమున

  • ఆ ఇద్దరు హీరోలతో మూడేళ్లు సినిమాలు చేయలేదు
  • నేను చిన్న హీరోలతో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి 
  • 'గుండమ్మ కథ' కోసం రాజీ ప్రయత్నం జరిగింది
ఆనాటి చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోలు ఇద్దరు తనని పక్కన పెట్టేసిన విషయాన్ని గురించి .. ఆ తరువాత సంగతులను గురించి 'తెలుగు పాప్యులర్' టీవీతో జమున ముచ్చటించారు. " సినిమారంగ చరిత్రలో ఇద్దరు టాప్ హీరోలు .. ఒక హీరోయిన్ తో మేం నటించమని అంటే, మీరు నటించకపోయినా ఫరవాలేదు .. దారినపోయే దానయ్యతో నటించి జమున నిలబడుతుందని ఛాలెంజ్ చేసి .. ప్రూవ్ చేశాను. ఆ ఇద్దరు హీరోలతో మూడేళ్లు సినిమాలు చేయలేదు. కొన్ని సినిమాలు వాళ్లవి .. కొన్ని సినిమాలు నావి పోయి ఉండొచ్చు. ఆ సమయంలో చిన్న హీరోలతో నేను చేసిన సినిమాలు 100 రోజులు ఆడినవి కూడా వున్నాయి" అన్నారు జమున.

 "అటువంటి పరిస్థితుల్లో 'గుండమ్మ కథ' సినిమా కోసం నాగిరెడ్డి - చక్రపాణిగారు రాజీ ప్రయత్నాలు చేశారు. అవతల వైపు వాళ్లు .. ఇవతల నేను .. మా నాన్న కూర్చున్నాం. సారీ .. చెప్పమన్నారు .. ఇకపై ఇలా నడచుకోనంటూ క్షమాపణ పత్రం రాయమని అన్నారు. ఏ తప్పు చేశానని క్షమాపణ చెప్పాలి .. నిజంగానే తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉంటే సారీ చెబుతాను. ఇలా నడచుకోనంటూ పత్రం రాయమంటున్నారు .. నేను ఎలా నడచుకున్నాను? అవన్నీ చెప్పమనండి" అన్నాను. క్షమాపణ పత్రం రాసేది లేదని తేల్చి చెప్పాను. చివరికి సున్నితంగానే ఈ సమస్య పరిష్కరించబడింది" అని చెప్పుకొచ్చారు.          
Go Back to Shorts
jamuna
ntr
akkineni

More Telugu News