పది, పన్నెండు తరగతుల ఉత్తీర్ణత కనీస మార్కుల శాతం తగ్గింపు.. ఐసీఎస్ఈ బోర్డు నిర్ణయం!

  • 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు
  • బోర్డు నిర్ణయంతో గణనీయంగా పెరగనున్న ఉత్తీర్ణత శాతం
  • ఇతర బోర్డులతో సమానంగా ఉండాలనే ఈ నిర్ణయం
పది, పన్నెండు తరగతుల విద్యార్థుల ఉత్తర్ణీతకు అవసరమైన కనీస మార్కుల శాతాన్ని తగ్గించాలని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) బోర్డు నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తోంది. ఇతర బోర్డులతో సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్థుల కనీస ఉత్తర్ణీత మార్కుల శాతం 35 కాగా, పన్నెండో తరగతి విద్యార్థుల కనీస ఉత్తీర్ణత 40 శాతంగా ఉండేది. ఇకపై దీనిని వరుసగా 33, 35 శాతానికి తగ్గించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఎస్ఈ సీనియర్ అధికారులు తెలిపారు. ఐసీఎస్ఈ నిర్ణయంతో పది, పన్నెండు తరగతుల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
Go Back to Shorts
Tenth
Inter
ICSE
Marks

More Telugu News