పాక్ హైకమిషనర్ ను మార్చిన భారత్

  • అజయ్ బిసారియాను నియమించిన కేంద్రం
  • 1987 బ్యాచ్ కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి
  • త్వరలోనే విధుల్లో చేరనున్న ఆజయ్
  • ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ
పాకిస్థాన్ లో భారత దౌత్యాధికారిగా అజయ్ బిసారియాను నియమిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కి చెందిన అజయ్ ప్రస్తుతం పోలెండ్ లో భాతర రాయబారిగా ఉన్నారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ, అజయ్ త్వరలోనే పాక్ వెళ్లి విధుల్లో చేరతారని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ పాక్ లో హై కమిషనర్ గా ఉన్న గౌతమ్ బంబావలే, ఇటీవల చైనాకు రాయబారిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాయబారిగా అజయ్ ను కేంద్రం ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ అనంతరం అజయ్ రష్యన్ భాషను స్పెషలైజేషన్ గా ఎంచుకున్నారు.
Go Back to Shorts
ajay bisariya
pakisthan high commissioner

More Telugu News