దేవుడొస్తున్నాడని.. ఏడాదికి రెండు సార్లు విమానాశ్రయాన్ని మూసేస్తున్నారు!

  • ఏటా రెండు సార్లు దేవుడి కోసం మూసుకుపోయే తిరువనంతపురం విమానాశ్రయం
  • షణ్ముగం బీచ్ కు వెళ్లేందుకు ఒకేదారి
  • దేవుడొస్తున్నాడంటే విమానాలు రద్దు చేసి, రన్ వేకి ఇరువైపులా గౌరవ సూచకంగా నిలబడే సీఐఎస్ఎఫ్ సిబ్బంది
అవును, దేవుడి కోసం విమానాశ్రయాన్ని ఏడాదికి రెండు సార్లు మూసేస్తారు. ఇది ఏ దేశంలోనో అనుకోకండి. మన దేశంలోనే కేరళ రాజధాని తిరువనంతపురంలోనే! దేశంలోని రద్దీ విమానాశ్రయాల్లో తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ఒకటి. కేరళలో పైన్ కునీ, అల్పస్సీ పండుగలు జరుగుతాయి. ఈ సమయంలో పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలకు షణ్ముగం బీచ్ లో తిరుస్నానం చేయిస్తారు. అనంతరం దేవాలయానికి తీసుకెళ్తారు.

 ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆలయం నుంచి ఈ షణ్ముగం బీచ్ కు వెళ్లేందుకు దగ్గర దారి ఒకే ఒకటి ఉంది. అది ఎయిర్ పోర్ట్ రన్ వే మీదుగా ఉంటుంది. దీంతో ఈ రెండు ఉత్సవాల సమయంలో తిరువనంతపురం విమానాశ్రయాన్ని మూసేస్తారు. విమానాలు ఆపేస్తారు. రన్ వేకు ఇరువైపులా సీఐఎస్ఎఫ్ సిబ్బంది గౌరవ సూచకంగా నిలబడతారు. దీంతో దేవుడి కోసం ఏటా రెండు సార్లు మూతపడే విమానాశ్రయంగా తిరువనంతపురం విమానాశ్రయం రికార్డులకెక్కింది. 
Go Back to Shorts
Kerala
tiruvanantapuram
air port
run way
god

More Telugu News