గోవధను అడ్టుకునేందుకు కానిస్టేబుళ్లతో వెళ్లి అవమానాన్ని ఎదుర్కొన్న యువతి!

  • ఒక్కసారిగా దాడికి దిగిన స్థానికులు
  • 100 మంది దాడి
  • కారు ధ్వసం, దాడిలో విరిగిన నందిని చెయ్యి
  • కేసు నమోదు
ఆవులను వధిస్తున్నారని తెలుసుకుని, విషయాన్ని పోలీసులకు చెప్పి, వారిని వెంటబెట్టుకుని మరీ ఓ ప్రదేశానికి వెళ్లిన యువతి, అక్కడ స్థానికులతో అవమానించబడ్డ ఘటన బెంగళూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న నందిని అనే యువ టెక్కీ, తలఘట్టపుర పరిధిలోని టిప్పు సర్కిల్‌ కసాయిఖానా వద్ద ఆవులను చంపుతున్నట్టు తెలుసుకుంది.

దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకుని ఆ ప్రాంతానికి తన కారులో వెళ్లింది. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకున్న స్థానికులు, దాదాపు 100 మంది ఒకేసారి దాడికి దిగారు. ఆమె చెయ్యి విరిచేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ తతంగాన్ని చూసిన కానిస్టేబుళ్లు భయంతో బతుకుజీవుడా అనుకుంటూ పారిపోగా, ఒంటరిగా మిగిలిన యువతిపై అనుచితంగా ప్రవర్తించారు. చివరికి ప్రాణాలతో బయటపడ్డ ఆమె విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. కేసును విచారిస్తున్నామని తలఘట్టపుర పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
banglore
cow slaughter
techie nandini

More Telugu News