'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో విక్రమ్ తనయుడు!

  •  తమిళ రీమేక్ దిశగా 'అర్జున్ రెడ్డి'
  •  హీరోగా విక్రమ్ తనయుడు 'ధృవ్'
  •  ఈ రీమేక్ తోనే 'ధృవ్' పరిచయం
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్స్  గా వెలుగొందుతోన్న సీనియర్ హీరోల్లో విక్రమ్ ఒకరు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్, కొంతకాలంగా తన తనయుడు 'ధృవ్' ను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో వున్నారు. కొత్తదనంతో కూడిన కథ కోసం .. పూర్తి స్థాయిలో నటనకి అవకాశం వుండే పాత్ర కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు.

అలాంటి విక్రమ్ .. 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ పై దృష్టి పెట్టారు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమా, ఆయనకి ఒక రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో తన తనయుడు హీరోగా అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా అని ఆయన భావిస్తున్నారు. అందుకే తన తనయుడి ఎంట్రీ ఈ రీమేక్ తో జరుగనుందని ఆయన స్వయంగా ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.      
Go Back to Shorts
dhruv

More Telugu News