కనకదుర్గమ్మ ఆలయంలో ముగిసిన దసరా ఉత్సవాలు

  • పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు
  • భారీగా తరలి వచ్చిన భక్తులు
  • రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. అమ్మవారికి పూర్ణాహుతితో ఆలయ అర్చకులు శరన్నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. మరోవైపు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వర స్వామి తెప్పోత్సవం జరగనుంది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రోజు ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దర్శనం కోసం రెండు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. చివరి రోజు కావడంతో వీఐపీలు, భవానీ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం వచ్చారు.  
Go Back to Shorts
vijayawada kanakadurga
vijayawada
theppotsavam

More Telugu News