మంత్రి అనుచరులు చంపేస్తామని కత్తులతో బెదిరించారు: మంత్రి రావెలపై గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమున్‌ సంచలన వ్యాఖ్యలు

రంజాన్ స‌మ‌యంలో త‌మ ఇంటిపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిశోర్‌ బాబు అనుచ‌రులు దాడి చేశార‌ని గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమున్ ఈ రోజు మీడియాకు తెలుపుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. రావెల కిశోర్ బాబు తనపై కక్ష కట్టార‌ని, ఆయన అనుచ‌రులు క‌త్తుల‌తో త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి చంపేస్తామ‌ని బెదిరించార‌ని ఆమె ఆరోపించారు. త‌న‌కు రాజకీయ జీవితం లేకుండా చేస్తామ‌ని అన్నార‌ని చెప్పారు. తనకు, తన భర్తకు మంత్రి నుంచి ప్రాణహాని ఉందని, త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకున్నారు. తాను ఇన్ని రోజులూ త‌మ‌ పార్టీ పరువు పోతుందనే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని ఆమె అన్నారు.
Go Back to Shorts
allegations
ravela kishore

More Telugu News