చ‌దువు మానేయాల‌ని త‌ల్లిదండ్రుల ఒత్తిడి.. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

చ‌దువు మానేయాల‌ని త‌ల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావ‌డంతో ఓ ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృత‌దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌ద‌రు అమ్మాయి నావల్గ ఉన్నత పాఠశాల విద్యార్థిని క‌ల్ప‌న అని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
suicide

More Telugu News